ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే… అదిరిపోయే లాభాలే..!

-

మీ దగ్గర ఉన్న డబ్బును మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలని భావిస్తున్నారా..? ఇలాంటి వాళ్ళందరికీ నిజంగా ఇది మంచి సువర్ణవకాశం అనే చెప్పాలి. కొత్తగా నేడు మంచి ఆప్షన్ అందుబాటు లోకి వచ్చింది అయితే దీనివల్ల రేపటి నుండి భారత్ బాండ్ ఈటీఎఫ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది అయితే బ్యాంకులు వరుస పెట్టి డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి కాబట్టి దీనిలో డిపాజిట్ చేస్తే రాబడి ఎక్కువ ఉండదు కాబట్టి అధిక రాబడి కోసం మీరు ఏం చేయాలి అంటే ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి.

money invest
money invest

ఇలా ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ బాండ్ రెండో విడత సబ్స్క్రిప్షన్ మళ్ళీ ప్రారంభించింది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక రాబడి కూడా మీ సొంతం కావచ్చు. ఎడిల్‌వీస్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ భారత్ బాండ్ ఈటీఎఫ్ రెండో విడత సబ్‌స్క్రిప్షన్‌ బాధ్యతలను చూసుకుంటుంది. అయితే జూలై 14 అంటే రేపటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనిలో 2025 ఏప్రిల్, 2031 ఏప్రిల్ అనే రెండు రకాల మెచ్యూరిటీ అషన్స్ ఉన్నాయి.

దీనిలో మీరు ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే కచ్చితంగా డిమేట్ అకౌంట్ ఉండాలి. ఒక వేళ కనుక డీమ్యాట్ అకౌంట్ లేక పోతే భారత్ బాండ్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌ లో మీరు ఇన్వెస్ట్ చెయ్యండి. ఇలా ఏ ఆప్షన్ లో అయినా సరే మీరు ఇన్వెస్ట్ చెయ్య వచ్చు. భారత్ బాండ్ ఈటీఎఫ్ సబ్‌స్క్రిప్షన్ జూలై 17న ముగుస్తుంది. ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం రూ.1000 ఉన్నా సరి పోతుంది. మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. 0.005 శాతం మాత్రమే

Read more RELATED
Recommended to you

Latest news