ఐపీఎల్ 2023 : పర్పుల్ క్యాప్ అందుకున్న తుషార్ దేశ్ పాండే… !

-

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ కోసం ఎక్కువగా ఇండియన్ బౌలర్ల మధ్యనే పోటీ ఉండనుంది. ప్రస్తుతం టాప్ 5 లో ఉండే బౌలర్లలో నాలుగు ఇండియన్ బౌలర్లు కావడం గమనార్హం. కాగా ఆఫ్గనిస్తాన్ బౌలర్ల రశీద్ ఖాన్ ఒక్కడే ఓవర్సీస్ ఆటగాడు. ఈ రోజు చెన్నై మరియు ముంబై మ్యాచ్ ముందు వరకు కూడా పర్పుల్ క్యాప్ మహమ్మద్ షమీ దగ్గర ఉంది. కానీ ఈ రోజు ముంబై మీద యంగ్ బౌలర్ తుషార్ దేశ్ పాండే నాలుగు ఓవర్ లలో 2 వికెట్లు తీసి మొత్తం 19 వికెట్లకు చేరుకున్నాడు.

దానితో మహమ్మద్ షమీ కన్నా ఒక్క వికెట్ ఎక్కువగా సాధించడంతో మహమ్మద్ షమీ రెండవ స్థానానికి పడిపోవడంతో తుషార్ దేశ్ పాండే మొదటి స్థానానికి ఎగబాకాడు. ఇక చివరికి సీజన్ ముగిసే సమయానికి ఏ బౌలర్ పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news