ఐపీఎల్ రన్ మెషీన్ జైస్వాల్: ఆ ముగ్గురి నుండి చాలా నేర్చుకున్నా !

-

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న యశస్వి జైస్వాల్ ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ యంగ్ ఇండియన్ ప్లేయర్ ఆడిన 9 మ్యాచ్ లలో 428 పరుగులు చేసి డుప్లిసిస్ తర్వాత స్థానంలో ఉన్నాడు. కాగా డుప్లిసిస్ 466 పరుగులతో టాప్ లో ఉన్నాడు. గత మ్యాచ్ లో జైస్వాల్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. దీనితో సోషల్ మీడియాలో ఇతను హైలైట్ గా మారాడు. తాజాగా ఇతను ఇంతలా రాణించడానికి కారణం ఏమిటన్నది చూస్తే… జైస్వాల్ చెప్పిన విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. జైస్వాల్ మాటల్లో విరాట్ భయ్యా మరియు ధోని సార్ నా కెరీర్ ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి కీలక పాత్ర పోషించారని చెప్పాడు.

 

 

అదే విధంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నుండి కూడా బ్యాటింగ్ లో చాలా మెళకువలను నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. మరి జాజివాల్ ఈ ఐపీఎల్ సీజన్ లో టాప్ స్కోరర్ గా ఆరంజ్ క్యాప్ ను అందుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version