IPL 2024 : భారీ స్కోర్ చేసిన బెంగళూరు… సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరుగుతుంది.ఇక ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఓపెనర్స్ తొలి వికెట్ కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ డూప్లెసిస్ 12 బంతుల్లో 24 పరుగులు చేయగా, కింగ్ విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. పటిధర్ మాత్రం ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లో 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. మహిపాల్ లూమ్రర్ 4 బంతుల్లో 7 మాత్రమే చేశాడు.చివర్లో గ్రీన్ (37) రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 200 మార్క్ దాటింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లతో రాణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version