IPL 2024 : ఐపీఎల్ లో ఈరోజు డబుల్ ధమాకా !

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్ 3: 30 pm కి ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్లు కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ మాత్రం ఆడిన అన్ని మ్యాచ్లు ఓటమి చవిచూసింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రెండో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య లక్నో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ 7:30 ప్రారంభం కానుంది.గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్ లలో గెలవగా, లక్నో మూడు మ్యాచ్లు రెండింట్లో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news