IPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ లోకి సౌతాఫ్రికా విధ్వంసకర ప్లేయర్

-

ఢిల్లీ క్యాపిటల్కు స్టార్ ఆల్ రౌండర్ ,ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే.తొడ కండరాల గాయానికి చికిత్స కోసం అతడు కొన్ని రోజుల క్రితమే ఆస్ట్రేలియాకు వెళ్లారు.గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు.

దీంతో మిచెల్ మార్ష్ స్థానాన్ని భర్తీ చేసేపనిలో ఢిల్లీ క్యాపిటల్స్ పడింది.అతడి స్థానంలో సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు రస్సీ వాండర్ డస్సెన్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలంలో అతడు అమ్ముడుపోలేదు. ఇప్పుడు అతడి బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో కొనుగోలు చేసినట్లు టాక్. కాగా డస్సెన్ గత PSLలో 7 మ్యాచ్ ల్లోనే 364 రన్స్ బాది సెకండ్ లీడింగ్ రన్స్కోరర్ గా నిలిచారు.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి పాయింట్ పట్టికలో 8వ స్థానంలో ఉంది.ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news