IPL 2024 : భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్… రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్, రాజస్థాన్ మధ్య మరో రసవత్తర పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 201/3 స్కోర్ చేసింది. సన్రైజర్స్ ఓపెనర్లలో అభిషేక్ శర్మ 12 పరుగులకే అవుట్ అయినప్పటికీ మరో ఒపెనర్ హెడ్ అర్థ సెంచరీతో రాణించాడు.

తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి 42 బంతుల్లో 8 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 76* రన్స్ బాదారు. మూడో వికెట్ కు హెడ్, నితీశ్ రెడ్డి 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్లాసెన్ తో కూడా నితీశ్ రెడ్డి 70 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు.అన్మోల్ ప్రీత్ 5, క్లాసెన్ 42* పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేష్ ఖాన్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news