ట్రంప్ తల నరికితే 575 కోట్లు ఇస్తామని ప్రకటించిన ఇరాన్…!

-

తమ టాప్ కమాండర్ జనరల్ ఖాసీం సులైమానీని అమెరికా దారుణంగా హత్య చేయడంపై ఇరాన్ రగిలిపోతుంది. ఎలా అయినా సరే అగ్ర రాజ్యం అమెరికా మీద పగ తీర్చుకోవాలని భావిస్తుంది. గత శుక్రవారం డ్రోన్ దాడిలో ఖాసీం ని అమెరికా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరాన్ అమెరికా మీద కక్ష సాధింపు చర్యలకు దిగాలని భావిస్తుంది. సోమవారం ఇరాక్ రాజధాని టెహ్రాన్ లో,

ఖాసీం అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. దీనికి భారీగా ఇరాన్ ప్రజలు, సైనికులు హాజరయ్యారు. అధికారిక లాంచనాలతో ఆయన అంత్యక్రియలను ఇరాన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడి తల నరికి తెచ్చిస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది ఇరాన్. ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలపై ఏకంగా 80 మిలియన్ డాలర్లు,

మన కరెన్సీలో దాదాపు 575 కోట్ల రూపాయలు రివార్డు ప్రకటించింది. దేశంలో 80 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారందరి నుంచి ఒక్కో డాలర్ వసూలు చేసి, తల తెచ్చి ఇచ్చిన వారికి అందజేస్తామని సంచలన ప్రకటన చేసింది ఇరాన్. ఇక సులైమానీ కుమార్తె కూడా అమెరికాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. యుద్ద౦ ఇక్కడితో ముగియలేదని, ముందు ముందు ఇంకా ఉందని ఆమె హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news