ఆ కారణంగానే.. పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ మధ్య వైరం మొదలైందా..?

-

పవన్ కళ్యాణ్ నటన తెలుగు సినీ పరిశ్రమకే పరిమితమైన ఈయనకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా సరే నటించాలని ఎంతోమంది నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇకపోతే ఈ క్రమంలోనే ఒక నటుడి విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా మోసపోయారని తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ కాంబినేషన్ ఎంతో బాగా ఉంటుందని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే . సుస్వాగతం సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ మొదలై.. ఆ తర్వాత జల్సా, బద్రి వంటి ఎన్నో చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించి వీరి కాంబినేషన్ కి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్.. ప్రకాష్ రాజు చేతిలోనే మోసపోయాడు అని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అసలు కారణం ఏమిటంటే పవన్ కళ్యాణ్ హీరోగా గుడుంబా శంకర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో ని వీరిద్దరికీ గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయంలో ప్రకాష్ రాజ్ చేసిన మోసం వల్లే పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు. ఇక అసలు విషయం ఏమిటంటే గుడుంబా శంకర్ సినిమాలో ఆశిష్ విద్యార్థి చేసిన కామెడీ విలన్ క్యారెక్టర్ కు ముందుగా ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ వీరశంకర్ కాగా ..అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు ఈ సినిమాను నిర్మించడం .. మీరాజాస్మిన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

ఇక ప్రకాష్ రాజ్ తో కొన్ని సీన్లు షూటింగ్ జరుపుకున్నాక ఆయన తన అమ్మకి ఆరోగ్యం బాగా లేదని చెప్పి షూటింగ్ కి డుమ్మా కొట్టి తమిళ సినిమా షూటింగ్లో పాల్గొనడం జరిగింది . ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక వెంటనే సినిమా నుంచి ప్రకాష్ రాజ్ ను తీసివేయాలని దర్శకుడికి చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడం జరిగింది. చివరికి ఫిలిం ఛాంబర్ పెద్దలు.. దర్శకుల సంఘం అందరూ వచ్చి వీరిద్దరిని రాజీ కుదరడంతో మళ్లీ కలిసి పని చేశారు. అంతే కాదు ప్రకాష్ రాజ్ కూడా జరిమానా కట్టి.. తన తప్పు తెలుసుకుని.. క్షమించమని కోరిన తర్వాతనే ఆయనకు తెలుగు సినిమాలలో అవకాశం లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news