ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు..

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు.ముఖ్యంగా పేద ప్రజలకు అండగా ఉంటూ పెన్షన్ పథకాలను అమలు చేస్తున్నారు.. ఎప్పటికప్పుడు కొత్తగా పెన్షన్లను అందిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో మరో కొత్తగా 3 లక్షల 98 మందికి సామాజిక పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

గత ఏడాది డిసెంబర్లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. అనంతరం డిసెంబర్ 1 నుంచి ఈ సంవత్సరం జూన్ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం దరఖాస్తులు అందగా, వాటిని జూన్ 15-23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలిన జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 3 లక్షల మంది పెన్షన్కు అర్హులని తేల్చింది వైసిపి సర్కారు.

కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు, పాస్‌బుక్‌లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. నవరత్నాల్లో భాగంగా వివిధ పథకాలతో పాటు వైఎస్‌ ఆర్‌ పింఛన్‌ కానుకను అమలు చేస్తున్నారు..అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాలని సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులను హెచ్చరిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news