విజయసాయిరెడ్డి బుర్ర తక్కువ వాడని తేలిపోయింది – బుద్దా వెంకన్న

-

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి, టిడిపి అధినేత బుద్ధ వెంకన్న మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ గురించి తెలిసిందే. అయితే తాజాగా విజయసాయిరెడ్డి ఈ విధంగా ట్విట్ చేశారు “విశాఖపట్నం ఎదుగుదలపై టీడీపీ దృష్టి పెట్టి ఉంటే ఈరోజు టాప్ 5 లో ఉండేదేమో.. ఇప్పుడు వైఎస్ఆర్సిపి హయాంలో వైజాగ్ ఎదుగుతుండడంతో ఉత్తరాంధ్ర పై టిడిపి మళ్లీ దురుద్దేశంతో అడ్డంకులు సృష్టిస్తోంది. ఏపీకి వైజాగ్ రాజధానిగా మారి హైదరాబాద్ దాటుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది”అంటూ విజయసాయి చేసిన ట్వీట్ కి

బుద్దా వెంకన్న రీ ట్వీట్ చేశారు.”ఇప్పటివరకు విజయసాయి రెడ్డికి బుర్ర అరికాల్లలో ఉందనే అనుమానం ఉండేది. విశాఖ ఆదాయంపై నీట్వీట్ చూశాక వీసారెడ్డి బుర్ర తక్కువ వాడని తేలిపోయింది. 2016 – 17 లోనే విశాఖ జిడిపి 43.5 బిలియన్ ఉంది. ఇప్పుడున్న ద్రవయోల్బణంతో లెక్కిస్తే.. మీరు పెంచినట్టా, తగ్గించినట్టా అనేది నీ దొంగ సిఏ బ్రెయిన్ తో ఆలోచించు”. అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version