BREAKING : RS బ్రదర్స్ లో ఐటీ రైడ్స్..వెలుగులోకి షాకింగ్ నిజాలు

-

రెండు తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్. అయితే తాజాగా ఈ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ కు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ మహానగరంలోని ఆరు చోట్ల తాజాగా ఐటి అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. షాపింగ్ మాల్స్ కు చెందిన ఆఫీసులతో పాటు వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. కూకట్పల్లి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్‌ సహా మరో పది చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.


రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార సంస్థలలో ఐటి అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ల లో, వాటి కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్ఎస్ బ్రదర్స్ భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఐటి అధికారులు దాడులు చేసినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ దాడిలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news