ధోని ఇకనైనా సాకులు మానేయ్..?

-

మొదటిసారి ధోనీ కెప్టెన్సీ తీవ్ర విమర్శల పాలు అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ధోనీ వ్యవహరించిన తీరుపై ఇప్పటికి ఎంతో మంది క్రికెటర్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ధోని చెప్పిన కారణాలను కూడా తప్పుపడుతున్నారు మాజీ క్రికెటర్లు. ఇటీవల ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మెన్ పీటర్సన్ కూడా ధోనిపై విమర్శలు చేశారు.

dhoni

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఎంతో అనుభవం కలిగిన ధోని ఏడవ స్థానంలో బ్యాటింగ్ కి రావడం తనను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ తెలిపిన పీటర్సన్… ధోని చెప్పిన కారణాలపై కామెంట్ చేశాడు. ఏ జట్టుకైనా క్వారంటైన్ నిబంధనలు ఒకేలా ఉంటాయని… క్వారంటైన్ పూర్తి చేసి మిగతా జట్ల ఆటగాళ్లు రాణించినప్పుడు ధోనీ మాత్రం ఎందుకు సాకులు చెబుతున్నాడు అంటూ ప్రశ్నించాడు. సాకులు చెప్పడం ఒక ధోని కి మాత్రమే చెల్లుతుందని.. ఇప్పటికైనా సాకులు మానుకొని.. ఆట పై దృష్టి పెడితే బాగుంటుంది అంటూ కామెంట్ చేశాడు పీటర్సన్.

Read more RELATED
Recommended to you

Latest news