“ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” నుండి వెన్నెల కిషోర్ లుక్ రిలీజ్!

-

నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి వెన్నెల కిషోర్‌ ఫస్ట్‌ లుక్ ను రిలీజ్‌ చేసింది. ఆయన బర్త్‌ డే ఉన్న నేపథ్యంలోనే వెన్నెల కిషోర్‌ ఫస్ట్‌ లుక్ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news