చెన్నై సూపర్ కింగ్స్ కి దూరం కానున్న జడేజా!

-

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2022 కు ముందు సీఎస్ కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంఎస్ ధోని తప్పుకోవడంతో.. నూతన సారధిగా జడేజా ఎంపికయ్యాడు. అయితే సారధ్య బాధ్యతలు చేపట్టిన జడేజా ఒత్తిడి కారణంగా టోర్నీ మధ్యలోనే..తిరిగి ధోనీకి అప్పగించేశాడు. అనంతరం గాయం కారణంగా మిగిలిన సీజన్ కు జడేజా దూరమయ్యాడు.

ఈ క్రమంలో జడేజా సీఎస్కే పోస్టులను తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడం.. ఆ వార్తలకు మరింత అధ్యం పోసినట్టు అయింది. దీనికి తోడు మే లో ఐపీఎల్ ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యంతో జడేజా దూరంగా ఉన్నాడు. కెప్టెన్ ధోని పుట్టినరోజు అభినందనలు తెలియజేస్తూ చెన్నై ఆటగాళ్లు అందరూ కలిసి చేసిన వీడియోలో జడేజా మాత్రమే లేడు.

అంతేకాక ఆటగాళ్ల మధ్య బంధాన్ని దృఢపరచడానికి సిఎస్కే నిర్వహించే కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడంతో జడేజా జట్టు ను  వీడనున్నాడు అన్న వార్తలకు మరింత బలాన్ని అందిస్తుంది. వచ్చే ఐపీఎల్ లోను ఆడతనని ధోని గత సీజన్ లోనే స్పష్టం చేశాడు. అతడు కెప్టెన్ గానే జట్టును నడిపించనున్న నేపథ్యంలో జడేజా మళ్ళీ జట్టులో చేరతాడా అనేది అనుమానంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news