మందుబాబులకు భారీ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..?

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యపాన నిషేధ రాష్ట్రం గా మార్చాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించినప్పటికీ ఇటీవలే హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అవకాశం ఉందని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు రావడంతో ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఘటనలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

దీంతో మందు బాబులు అందరికీ భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడాన్ని నిషేధిస్తూ జగన్మోహన్రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి మద్యం తీసుకు రావాలన్నా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే అనుమతి ఇస్తాము అంటూ స్పష్టం చేసింది జగన్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news