ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ ఈ బీసీ నేస్తం పథకం రెండో విడతలో భాగంగా ఈనెల 12వ తేదీన అంటే ఎల్లుండి లబ్ధిదారులైన మహిళల ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి 15 వేల చొప్పున జమ చేయనున్నారు.

బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య రెడ్డి, కమ్మ, కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఈ కార్యక్రమం జరగనుంది. కాగా గత ఏడాది ఈ పథకం కింద దాదాపు 4 లక్షల మంది మహిళల ఖాతాలలో ఏకంగా 590 కోట్లు జమ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇక ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగినట్లు స్పష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పెరిగిన లబ్ధిదారులకు కూడా ఈసారి డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది.