సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మ అరాచకానికి పరాకాష్ట : చంద్రబాబు

-

ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు.తొలి సంతకం డీఎస్సీపైనేనని, రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ రద్దుపైనే పెడతానని అన్నారు.రాష్ట్రంలో అరాచకాలు పెరిగియపోయాయని ,ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా సీఎం జగన్ కే వెళ్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

వృద్ధుల కష్టాలకు ముఖ్యమంత్రి జగనే కారణమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్న లక్షా 50 వేల మంది సచివాలయ ఉద్యోగులకు ఇంటి వద్దనే పింఛన్లు అందించవచ్చని.. కావాలనే వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ కోసం వృద్ధులను మండుటెండల్లో తిప్పి చంపుతున్నారని మండిపడ్డారు.గతంలో తండ్రి లేని బిడ్డ అని అన్నాడని, ఆ తర్వాత కోడి కత్తి డ్రామా ఆడారని, ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని చంద్ర బాబు విమర్శించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటని, సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మ అరాచకానికి పరాకాష్ట అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news