టీమిండియా క్రికెటర్ శ్రీకర్‌ భరత్‌ పై జగన్ ట్వీట్

-

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే, మిండియా క్రికెట్ జట్టులో కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్ గా ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ట్విటర్ వేదికగా భరత్ ఫోటో షేర్ చేస్తూ అభినందనలు తెలియజేశారు. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఆస్ట్రేలియాతో నాగ్ పూర్ లో గురువారం ఆరంభమైన తొలి టెస్ట్ తో ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. భరత్ తో పాటు టి20 స్టార్ సూర్య కుమార్ యాదవ్ భారత్ తరపున తొలి టెస్ట్ ఆడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version