రేవంత్ ఉత్తమ్ ల మధ్య వాగ్వాదం పై స్పందించిన జగ్గారెడ్డి

-

ఈ రోజు తెలంగాణ గాంధీభవన్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ఎన్నికల కమిటీ తో జరిగిన సమావేశంలో ఒక కుటుంబానికి చెందిన రెండు టికెట్ల విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి కు మధ్యన చిన్నపాటి వాగ్వాదం జరిగిందన్న విషయం వైరల్ కావడంతో.. వెంటనే ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రంగంలోకి దిగారు. మేము అందరం గాంధీభవన్ దాదాపుగా మూడు గంటల పాటు ఆనందకరమైన వాతావరణంలోనే సీట్ల ఎంపిక గురించి చర్చించాము అంటూ భిన్నమైన సమాధానాన్ని ఇచ్చారు జగ్గారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల గురించి చర్చించాము.. కానీ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి అన్న అంశంపైన చర్చ జరగలేదని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సీట్ల విషయంలో తుది నిర్ణయం రేవంత్ మరియు ఉత్తమ్ లది అని , వారి మధ్య జరిగిన వాడివేడి చర్చలు మీరనుకుంటున్నంత పెద్దది కాదని చెప్పకనే చెప్పారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news