నా ఆవులు పోయాయి.. డీజీపీకి లేఖ రాసిన జగ్గారెడ్డి

-

తెలంగాణ రాజకీయాలు ఆవుల చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాజా సింగ్ పోలీసుల మీద ఆరోపణలు చేయడం, ఆయనకు పోలీసులు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ఆవులు పోయాయని డీజీపీకి లేఖ రాశారు. 2020 సంవత్సరం అక్టోబర్ నెలలో నా ఆరు (6) ఆవులు దొంగలించబడ్డాయి  దొంగలించబడి ఇప్పటికే మూడు నెలలు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆవులన్నిటినీ దొంగిలించి దూడలను మిగిల్చారని పేర్కొన్నారు. 

సంగా రెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగిందని  పోలీసులు వెతుకుతున్నారు.. ఇందులో నేను పోలీసులను తప్పుపట్టడం లేదని అన్నారు. కానీ ఆవు దొంగతనం చేసిన వారిని పట్టాల్సిన బాధ్యత పోలీస్ లదేనని ఆయన అన్నారు. ప్రేమతో పెంచుకున్న ఆరు ఆవులు దొంగలించబడినా ఒక ఎమ్మెల్యేని అయిన నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఆవులను మెత కోసం వదిలితే దొంగలు కభేళలకు తరలిస్తున్నారని ఆయన అన్నారు. నా ఆవులే కాదు..సంగారెడ్డి లో చాలా ఆవులు, ఎడ్లు దొంగలించబడ్డాయని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news