పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో విజయం సాధించిన జనసేన

-

ఏపీ అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం క్రియేట్ చేసింది.అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్..తాను అనుకున్నది సాధించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన 100% స్ట్రైక్ రేటు మాటను నిజం చేశారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయమైంది. సీట్లు తక్కువగా తీసుకోవడంపై విమర్శలు వచ్చినప్పుడు ఆయన సమర్థించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ చెప్పిందే కరెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు పవర్ స్టార్. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news