రాయల్​ ఫ్యామిలీ కంచుకోట బద్దలు కొట్టిన ఫైర్ బ్రాండ్.. మండిలో కంగనా రనౌత్ ఘనవిజయం

-

లోక్‌సభ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ గతంలో కంటే తక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ముఖ్య నేతలు మాత్రం తమ ఇలాకాలో విజయం సాధిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ రాజకీయ అరంగేట్రంలోనే జయకేతనం ఎగురవేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆమె ఘన విజయం సాధించారు.

తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 71వేల ఓట్ల మెజార్టీతో కంగన గెలుపొందారు. ఏడో దశ ఎన్నికల్లో భాగంగా ఈ స్థానానికి జూన్‌ 1వ తేదీన పోలింగ్ జరిగింది. రాయల్​ ఫ్యామిలీ కంచు కోటగా ఉన్న ఈ మండి స్థానంలో కంగనా రనౌత్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. దీంతో మండిలో సంబురాలు అంబరాన్నంటాయి. మరోవైపు కంగనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news