JanaGanaMana : పూరీ – దేవరకొండ కాంబోలో మరో పాన్ ఇండియా.. టైటిల్ పోస్టర్ రిలీజ్

-

టాలీవుడ్‌ సంచలన డైరెక్టర్‌… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్టేట్స్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే.. ఈ సినిమా విడుదల కాకముందే… ఓ అదిరిపోయే అప్ డేట్‌ ఇచ్చారు పూరి జగన్నాధ్, విజయ్‌.

లైగర్‌ పూర్తి కాగానే.. మరో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఈ సినిమాకు ‘జనగణమన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. అంతేకాదు ఈ సినిమాను 2023 ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా పూరి సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టులు కూడా వదిలింది చిత్రబృందం.

Read more RELATED
Recommended to you

Latest news