జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన జనసేన

-

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు జనసేన పార్టీ నేతలు. దీంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనర్ బాలిక కేసులో న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు (జనసేన కార్యకర్తలు) నిరసన తెలిపారు. దీంతో భారీగా తరలి వచ్చారు ప్రజలు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దమ్మ గుడి వరకు భారీగా ట్రాఫిక్ జాం అయింది.

దీంతో భారీగా పోలీసులు మోహరించారు. కార్యకర్తలను అరెస్టు చేసి గోషామాల్ పంపారు పోలీసులు.

కాగా.. మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు మైనర్ బాలురు. ఇన్నోవా వాహనం లో బాలురు అత్యాచారం చేశారని.. ఇన్నోవా వాహనం పోలీసులకు దొరకకుండా దాచేశారని తెలిపారు. నగరంలో సీసీ కెమెరాలు మొత్తం జల్లెడ పట్టిన పోలీసులకు ఇన్నోవా వాహనం జాడ తెలియడం లేదు.. గోవాకి వెళుతున్నట్లు సెల్ఫోన్లను గోవాకు మళ్ళించి కర్ణాటక కి పరారయ్యారు నిందితులు. ఘటన జరిగిన తర్వాత ఐదుగురు ఐదు రూట్లలో పరారీలో ఉన్నారు. ఈ ఐదు నిమిషాలు వెనక మరొక మాస్టర్ బ్రెయిన్ పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news