Janasena: పొత్తులపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

-

మరికొన్ని రోజుల్లో ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను సిద్ధం ఈ క్రమంలో ఏపీలో పొత్తుల రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక్కటై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.అయితే బీజేపీ తో టీడీపీ, జనసేన పొత్తుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో, టీడీపీ, జనసేన నాయకులు చర్చలు జరుపుతున్నారు. కాగా ఆ పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తులో ఉంటుందని.. ఉండాలని కూడా తాను కోరుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలోని రాక్షస పాలనను అంతమొందించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని.. అలా ఏకమైతే తప్పేం కాదు అని నాగబాబు తెలిపారు. అలానే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news