జగన్… నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి గుర్తుంచుకో : పవన్ కళ్యాణ్

-

విశాఖ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి మూడవ విడత యాత్రను మొదలుపెట్టారు. అయితే ప్రజలు ఒక క్లారిటీకి వచ్చేశారు… పవన్ ఈ వారాహి యాత్రలు చేస్తున్నది కేవలం ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడానికి, ఆయనను దూషించడానికి మాత్రమే అని.. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న ఎవరైనా తానేమి చేస్తున్నానో చెప్పుకుని ఓట్లు అడగాలి, అంతేకానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటూ టార్గెట్ చేసి మాట్లాడకూడదు. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. ఇక తాజాగా వారాహియాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఉత్తరాంధ్ర మొత్తాన్ని దోచుకుతింటున్నాడని వ్యాఖ్యలు చేశారు పవన్..

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారగానే అన్ని విషయాలను బయటకు తీసుకువచ్చి జగన్ ను మళ్ళీ జైలుకు పంపిస్తానంటూ వ్యక్తిగత దూషణలకు దిగాడు పవన్ కళ్యాణ్.. జగన్ గుర్తుంచుకో ఎన్నికల తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి అంటూ వార్నింగ్ సిచ్చాడు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version