మా కుటుంబానికి ఒకటే టికెట్టు అని చంద్రబాబు చెప్పలేదు: జెసి ప్రభాకర్ రెడ్డి

-

ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మా కుటుంబానికి ఒకటే టికెట్టు అని చంద్రబాబు చెప్పలేదు అని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వేరే వాళ్లకు కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పినట్లు విన్నాను అని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ అనంతపురం లోకసభకు జరిగిన ఎన్నికల లో రెడ్ల సామాజిక నేతలే ఎక్కువ మంది గెలిచారు అని చెప్పారు. అలానే సామాజిక సమీకరణాలు ఏమి పని చేయవు అని అన్నారు.

ప్రజలలో ఉండే వారికే పట్టం కడుతారు అని చెప్పారు. అలానే జనసేన తాజాగా బిజెపితో పొత్తు ఉండబోతున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపు లో చంద్రబాబుకి కొన్ని ఇబ్బందులు వుంటాయని కూడా చెప్పారు. మా కుటుంబానికి, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ టికెట్ కావాలని చంద్ర బాబు ని అడిగాము అని కూడా చెప్పారు. పొత్తులు తేలక సీట్లు అంశంప్తె స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news