బీజేపీ అంటే ఫైర్ కాదు… తెలంగాణలో పాయిజన్ గా మారుతోంది- ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-

బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని ఆ పార్టీ అనుకుంటుందని అయితే తెలంగాణ లో మాత్రం బీజేపీ అంటే పాయిజన్ గా మారుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలోని పథకాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలే ప్రశంసిస్తుంటే… వారు మాత్రం రాష్ట్రంలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలు రాసిచ్చే స్క్రిప్టు అంతా ఒక్కటే అని కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులు మాత్రమే మారుతున్నారని ఎద్దేవా చేశారు. నడ్డా, తరుణ్ చుగ్, శివరాజ్ సింగ్ చౌహన్ లు ఇదే స్క్రిప్టును చదువుతున్నారని అన్నారు.jeevan reddy తెలంగాణలో ఉన్న పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేవలం మతాలు, వర్గాలు, మనుషుల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తుందని జీవన్ రెడ్డి విమర్శించారు. పంజాబ్ లో రైతుల దెబ్బకు ప్రధాని 20 నిమిషాల పాటు ఆగారని… భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ దొడ్డిదారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. మీ 18 రాష్ట్రాల్లో సీఎంలు వచ్చి తెలంగాణలో కూర్చున్నా… 2023లో కాషాయ జెండా ఎగరదని స్పష్టం చేశారు. మీకు 119 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రావని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news