జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. జియోఫై డివైస్‌పై 5 నెల‌ల‌పాటు ఉచిత డేటా, కాల్స్‌..!

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు జియోఫై డివైస్ కొనుగోలుపై బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. ఆ డివైస్‌ను కొనుగోలు చేసి ఏదైనా ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే 5 నెల‌ల పాటు ఉచితంగా డేటా, కాల్స్ పొంద‌వ‌చ్చు. కాగా జియోఫై హాట్‌స్పాట్ డివైస్ ధ‌ర రూ.1,999 ఉండ‌గా.. వినియోగ‌దారులు దీన్ని ముందుగా కొనుగోలు చేసి జియో సిమ్ వేసి యాక్టివేట్ చేయాలి. ఇక ఈ డివైస్‌కు అందుబాటులో ఉన్న 3 ప్లాన్ల‌లో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకోవాలి.

jio gives 5 months of data and calls free on jiofi hotspot device

జియో ఫై డివైస్‌కు గాను రూ.199, రూ.249, రూ.349 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.199 ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ వ‌స్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అలాగే రూ.249 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 29 రోజులుగా ఉంది. అలాగే రూ.349 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, ఉచిత కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులుగా ఉంది.

ఇక జియోఫై డివైస్‌ను కొని అందులో సిమ్ వేసి, ప్లాన్ తీసుకున్నాక ఒక గంట‌లోగా ఆ డివైస్ యాక్టివేట్ అవుతుంది. అప్ప‌టి నుంచి ఆ ప్లాన్లు యాక్టివేట్ అవుతాయి. స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా జియో ఈ ఆఫ‌ర్‌ను అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news