ఓఎంఆర్ విధానంలో గ్రూప్-1 పరీక్ష: టీఎస్ పీఎస్సీ

-

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్లో(ఓఎంఆర్ విధానం) నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది.రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 9న జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుందిఈ ఏడాది ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

కాగా…గతంలో లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా,పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news