వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కాదు.. కన్నాల బాబు : జనసేనాని

-

జగన్‌కు ఒక్క ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ ఇక చాలు.. వచ్చే ఎన్నికల్లో మీకు మీరు ఛాన్స్‌ ఇచ్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హక్కుల కోసం పోరాడితే ప్రజలపై కేసులు పెట్టారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదని అడిగితే కొట్టారని విమర్శించారు.

వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు రాజు కాదు.. కన్నాల బాబు అని ,నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే లేఅవుట్ వేసిన ప్రాంతంలోని భూములు కూడా కబ్జాచేస్తున్నారని అన్నారు.సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని కన్నాల బాబు భారీ భవంతి నిర్మించుకుంటే అడిగేవారు లేరని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఓటు చాలా విలువైందన్నారు జనసేనాని. సగటు మనిషిలా ఉండి పోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రాణాలు తెగించి ఒక నయవంచకుడు, గూండా, దోపిడీ దారుడితో పోరాడుతున్నట్టు తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రజల కోసం పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news