దేశ ప్రజలు మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చనున్నారు : రాజ్ నాథ్ సింగ్

-

దేశ ప్రజలు మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చి, ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దేశ రాజకీయాల నుంచి తుడిచిపెడతారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.ఈశాన్య దిల్లీ నియోజకవర్గ బీజేపి అభ్యర్థి మనోజ్ తివారీ నామినేషన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నియోజకవర్గ ప్రజలు మనోజ్ తివారీని మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ప్రపంచంలోనే ఇండియా బలమైన దేశంగా ఎదగాలన్న మహాత్మాగాంధీ కోరికను ప్రజలు నెరవేర్చబోతున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ”ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే బలమైన దేశంగా మారి, ప్రపంచదేశాలతో సన్నిహిత సంబంధాలను కలిగిఉంది అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలను గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేసేందుకు బీజేపి కృషి చేస్తోంది. రాష్ట్రంలోని ఏకైక బీజేపి సిటింగ్‌ ఎంపీ తివారి కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నయ్య కుమార్‌పై ఈశాన్య దిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news