రిషి సునాక్‌ ఎన్నిక ఓ మైలురాయి : జో బైడెన్‌

-

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి రిషికి అభినందనలు తెలిపారు. రిషి సునాక్ ఘనవిజయంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్‌ స్పందించారు. ఇండో-అమెరికన్లతో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజే ఓ వార్త తెలిసింది.. రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు’ అని అన్నారు. ఈ మాటలతో దాదాపు 200 మంది అతిథులు హర్షధ్వానాలు చేశారు.

‘‘అది ఒక ఎంపిక. మన నిత్యజీవితంలో, దేశం ప్రస్థానంలో అటువంటి ఎంపికలు చేస్తుంటాం. ముఖ్యంగా అమెరికా, భారత్‌,  యూకే వంటి ప్రజాస్వామ్య దేశాల ప్రస్థానంలో జరుగుతుంటాయి. ఈ రోజు ఇప్పుడే ఓ వార్త విన్నాను. బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఎన్నికయ్యారు.  ఒక సోదరుడిగా చెబుతున్నాను.. అద్భుతంగా ఉంది. రేపు రాజును కలవనున్నారు.  ఇది కీలకమైన మైలురాయి’’ అని జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news