జోషీమఠ్ వివాదం.. వెబ్​సైట్​లో సమాచారంపై కేంద్రం ఆంక్షలు

-

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి వేగంగా కుంగుతున్నట్లు ‘నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌’ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వెల్లడించిన నివేదిక సంబంధిత వెబ్‌సైట్‌లో ఇప్పుడు కనిపించడంలేదు. ఎలాంటి సమాచారాన్ని వెల్లడించవద్దంటూ వెబ్​సైట్​పై కేంద్రం ఆంక్షలు విధించింది. గందరగోళం నివారణకేననిఎన్డీఎంఏ చెబుతోంది.

జోషీమఠ్‌లో కొంతకాలంగా భూమి వేగంగా కుంగిపోతోందని ఇస్రోకు చెందిన ఈ కేంద్రం నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెం.మీ మేర కుంగినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి.. ఉపగ్రహ చిత్రాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీనిపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన తరుణంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఆ నివేదిక కనిపించకుండా పోయింది. ప్రజల్లో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వమే దానిని తొలగించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news