ఏపీలో జూనియర్‌ డాక్టర్లకు స్టైఫండ్‌ పెంపు

-

ఏపీ ప్రభుత్వం జూనియర్‌ డాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ₹44 వేల నుంచి ₹50,686కు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ₹46 వేల నుంచి ₹53వేలకు, మూడో సంవత్సరం విద్యార్థులకు ₹48,973 నుంచి ₹53,503కు పెంచింది.

ఎంబీబీఎస్ విద్యార్థులకు ₹19,589 నుంచి ₹22,527కు పెంచుతున్నట్లు ప్రభుత్వం.. ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన వేతనాలు 2022 జనవరి నుంచి అమలవుతాయని వెల్లడించింది. స్టైఫండ్‌ పెంచాలని జూడాలు గురువారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version