ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కేఏ పాల్

-

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పారు. కోర్టు అవకాశం ఇస్తే తాను లక్షల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతానని వివరించారు. అంతేకాదు, 10 లక్షల ఉద్యోగాలను ఇప్పిస్తానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

రూ.8 లక్షల కోట్ల విలువైన పరిశ్రమను కేవలం రూ.4 వేల కోట్లకే కట్టబెట్టాలని మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వమని చెప్పారు. మోదీకి వత్తాసు పలుకుతున్న ఇక్కడి పార్టీల నేతలు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కేఏ పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు థానే కోట్లు విరాళాలు తీసుకొచ్చి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుతానని.. 10 లక్షల మంది నిరోద్యుగులకు ఉపాధి కల్పిస్తానని వెల్లడించాహ్రూ ఆయన .

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version