వారికి కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన మోసం చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

-

ఈరోజు అమెరికాలోని చాల మదిని మంది తెలుగు విద్యార్థులు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కలవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లిన వాళ్లు తనను కలిశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో తీయటీ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసాన్ని వాళ్లు చెబుతుంటే ఆయన కళ్లల్లో నీళ్లు ఆగలేవన్నారు. దాదాపు 500 మంది విద్యార్థులు స్కాలర్షిప్‌లు రాక అప్పులు చేసి, ఇక్కడ ఇళ్లల్లో పనిచేస్తూ పొట్టనింపుకుంటూ, చదువుకున్నారని తెలియచేశారు ప్రవీణ్ కుమార్.

‘మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిస్తే తన చేతిలో ఏమీ లేదు అని చేతులు ఎత్తేసిండని, పోయి సీఎంనే అడగండి అని స్టుడెంట్స్‌తో అన్నాడంట..! (మరి నిరసనగా రాజీనామా చెయ్యండి కదా!) ఇంత చేతకాని సర్కారును మనం ఎందుకు భరించాలి?’ అని మండిపడ్డారు ఆయన. వారం రోజుల్లో ఈ విద్యార్థుల బకాయిలు క్లియర్ చేయకపోతే సంక్షేమ భవన్‌ను, ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తీవ్ర ఆగ్రహము వ్యక్తపరిచారు ప్రవీణ్ కుమార్. తర్వాత మీ ఫాంహౌసులను ఆక్రమించి వాటిని బహిరంగ వేలం వేసి విద్యార్థుల చదువును జీవితాలను కాపాడుకుంటామన్నారు ఆయన. ఎమ్మెల్యేలను మా పేదల బస్తీలలో తిరగనివ్వమని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version