పార్టీ మార్పు వార్తలపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

-

జనగామ జిల్లా : పార్టీ మార్పు వార్తలపై కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాలంలో తన పై దుష్ప్రచారం చేశారనీ…, కేసీఆర్ గారు నాకు సరియైన గౌరవం ఇస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. కష్టపడే వారికి కేసీఆర్ గారు గౌరవిస్తారన్నారు. పని చేసే వాళ్ళెవరో, పని చేయని వాళ్ళెవరో, పైసలు ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరో ప్రజలు గుర్తిస్తారని స్పష్టం చేశారు.

ఈ విషయంపై దుష్ప్రచారం చేయొద్దు, వర్గ విభేదాలు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేద్దామని అన్నారు. వచ్చే ఎలెక్షన్ల లోపు నియోజకవర్గంలో అన్ని చెరువులకు సాగు నీరు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు కడియం శ్రీహరి. ఉప ముఖ్య మంత్రి ఉన్న సమయంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (CBSE ) ను ధర్మసాగర్ మండలంలోని ఎలుకుర్తి గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరానని గుర్తు చేశారు. అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో పని చేద్దామని పిలుపునిచ్చారు కడియం శ్రీహరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version