సన్‌ రైజర్స్‌ కు మరో ఎదురుదెబ్బ..రూ.12 లక్షల జరిమానా

-

నిన్న రాజస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ దారుణ ఓట‌మిని చవి చూసింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫ‌లం అయింది.

 

దీంతో 61 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణ‌త 20 ఓవ‌ర్ ల‌లో 210 భారీ స్కోరు చేసింది. అటు ఛేజింగ్‌ కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఎక్కడా రాజస్థాన్‌కు పోటీ ఇవ్వలేకపోయింది.

దీంతో మొదటి ఓటమి చవి చూసింది హైదరాబాద్‌. అయితే.. ఈ ఓటమిని జీర్ణించుకోక ముందే.. హైదరాబాద్‌ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్‌ టీం స్లో ఓవర్‌ రేట్‌ తప్పిదానికి పాల్పడటంతో.. ఆ జట్టు కెప్టెన్‌ విలియమ్స్‌న్‌ కు రూ. 12 లక్షల జరిమానా వేసింది బీసీసీఐ. కేటాయించిన సమయంలో ఒక ఓవర్‌ తక్కువ వేయడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news