కంగనా తో సినిమా అంటే నో అంటున్న బీ టౌన్…!

-

కంగన రనౌత్‌ బాలీవుడ్‌పై పెద్ద పెద్ద పోరాటాలు చేస్తుంది గానీ, జనాలు మాత్రం ఈమెని పట్టించుకోట్లేదు. వారసత్వాన్ని విమర్శిస్తా, గ్రూపుయిజాన్ని అంతమొందిస్తా అని హడావిడి చేస్తోన్న కంగనాని వింత వ్యవహారంలా చూస్తున్నారు జనాలు. దీంతో బాలీవుడ్‌లో కంగన టైమ్‌ అయిపోయిందనే టాక్ వస్తోంది.

కంగనా రనౌత్ కొన్నాళ్లుగా “”ఫైర్‌ విల్‌ బి ఫైర్” అన్నట్లుగా బాలీవుడ్‌లో మంటలు రేపుతోంది. ఇండస్ట్రీలో గ్రూపులున్నాయి.. వారసులు కొత్త టాలెంట్‌ని ఎదగనివ్వడం లేదని విమర్శలు చేస్తోంది. అయితే ఈ గొడవతో కంగనా రనౌత్‌ ఇమేజ్‌ దారుణంగా పడిపోతోంది. ఈమెని కరెంట్‌ ప్లగ్‌ కంటే ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయాక కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ని టార్గెట్‌ చేసింది. ఇండస్ట్రీ వారసులు, డ్రగ్‌ ఎడిక్ట్స్‌తో నిండిపోయిందని విమర్శిస్తోంది. అయితే జనాలు మాత్రం ఈ కామెంట్స్‌ని రిసీవ్‌ చేసుకోట్లేదు. కంగనా సొంత లాభం కోసం ఇండస్ట్రీని విమర్శిస్తుందనే ఒపీనియన్‌లో ఉన్నారు దర్శకనిర్మాతలు.

కంగన రనౌత్‌కి జనాల్లో క్రెడిబిలిటీ తగ్గిపోవడంతో, దర్శకనిర్మాతలు ఈమెని పక్కనపెట్టేస్తున్నారు. కంగనాతో సినిమా చెయ్యడం అంటే కరెంట్‌ ప్లగ్‌లో వేలు పెట్టడమేనని భయపడుతున్నారు. దీంతో కంగన రనౌత్‌కి ఇక సినిమాలు రావడం కష్టమేనని, ఈమె పనైపోయిందనే ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news