కోలుకుంటున్న భారత మాజీ కెప్టెన్.. థమ్సప్ సింబల్ తో అభిమానుల్లో ధైర్యం..!

-

భారత దిగ్గజ క్రికెటర్ అయిన 61 ఏళ్ల కపిల్ దేవ్ కీ ఇటీవలే గురువారం అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోర్టీస్ ఎస్కార్ట్ హార్ట్ దవాఖానా లో చేర్పించారు. ఈ క్రమంలోనే ఐసీయూలో కపిల్ దేవ్ కు చికిత్స అందించిన వైద్యులు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేశారు. అయితే ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నారూ కపిల్ దేవ్. ఆయన క్రమక్రమంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఆసుపత్రిలోని ఐసీయూలో తన కుమార్తెతో కలిసి కపిల్ దేవ్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ఫోటోలో చిరునవ్వు చిందిస్తూ థమ్సప్ అని చూపిస్తున్నారు కపిల్ దేవ్. ఇక కపిల్ దేవ్ కు గుండెపోటు వచ్చింది అని తెలియడంతో ఆందోళనలో మునిగి పోయిన అభిమానులందరూ ఈ ఫోటో చూసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news