ప్రియుడితో ఉన్నప్పుడు కొడుకు చూసాడని తల్లి దారుణం..!

-

తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ కసాయి తల్లి సొంత కొడుకునే హత్య చేయించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా పొన్నేరి నేడువరంపాక్కకంకి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో సెల్వం అనే వ్యక్తి తన భార్య తో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో మధ్య వాడు సూర్య (14) కు తన తల్లి అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది. తన తల్లి గోపాలకృష్ణన్ అనే వ్యక్తితో ఏకాంతంగా ఉన్న సమయం లో సూర్య చూసాడు.

దాంతో తన భర్తకు విషయం ఎక్కడ చెబుతాడో అని భయపడిన దుర్గ తన ప్రియుడు గోపాల కృష్ణ తో కొడుకును హతమార్చాలని చెప్పింది. దాంతో పథకం రచించిన గోపాల కృషన్ స్నేహితుడు అన్నామలై తో కలిసి గత నెల 9న సూర్య ను మూల ప్రదేశానికి తీసుకెళ్ళి హత్య చేశారు. ఈ ఘటన పై సూర్య తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా తల్లే కసాయి గా మారి ప్రియుడి తో హత్య చేయించిందని నిర్ధారించారు. దుర్గ తో పాటు ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news