కాంగ్రెస్ ప్లాన్ బి స్టార్ట్: ఎమ్మెల్యేలను 12 హెలికాఫ్టర్లలో బెంగుళూరు కు తరలింపు !

-

కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ వైపు దూసుకు వెళుతోంధి. ముందు నుండి అనుకుంటుండగానే కాంగ్రెస్ విజయం ఖరారు అవుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కాంగ్రెస్ విజయన్ దూరం చేయలేకపోయాయి. ఎంతమంది సినీ తారలు వచ్చి బీజేపీ తరపున ప్రచారం చేసినా ఉపయోగం లేకపోయింది. కాగా తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను అందరితో హై కమాండ్ టచ్ లో ఉంటూ వారిని బీజేపీ కంటపడకుండా మరియు వారి ట్రాప్ లో పడకుండా ఉండడానికి ప్లాన్ బి స్టార్ట్ చేసింది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ నుండి గెలిచిన వారినందరినీ వివిధ ప్రాంతాల నుండి బెంగళూర్ కు తరలించడానికి కాంగ్రెస్ హై కమాండ్ 12 హెలికాఫ్టర్లను రంగంలోకి దింపింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరిని ఏదో ఒక రహస్య ప్రాంతంలో ఉంచి జాగ్రత్తలు తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version