వామ్మో 600 కోట్లతో మంత్రి కూతురు పెళ్ళి.. గాలి జనార్దన్‌ ని మించిన గాలి అనుచరుడు..!

-

సాధారణంగా రాజకీయ నాయకులు కొన్ని కొన్ని కారణాలతో హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు అనేది వాస్తవం. వాళ్ళు ఎం చెయ్యాలి అన్నా సరే కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎం చేస్తే ఏ గోల వస్తుందో అనే భయం వారిలో ఎక్కువగా ఉంటుంది. కాని కొంత మంది మాత్రం ఈ విషయంలో ఎక్కడా భయపడే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

గాలి జనార్ధన్ రెడ్డి గతంలో 500 కోట్లతో తన కుమార్తె వివాహం చేసారు. శుభలేఖలో ఒక వీడియో పెట్టి మరీ హడావుడి చేసారు. భారీగా ఖర్చు చేసి పెళ్లి చేసారు. నోట్ల రద్దు జరిగినా సరే ఆయన మాత్రం ఎక్కడా భయపడలేదు. ఇక తాజాగా ఆయన అనుచరుడు, బళ్ళారి శాసన సభ్యుడు, కర్ణాటక మంత్రి శ్రీరాములు తన కుమార్తె వివాహానికి దాదాపు 600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇందుకోసం బాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా డిజైనర్లు వస్తున్నారట. అలాగే విదేశాల నుంచి కొంత మంది ప్రత్యేక నిపుణులు ఆయన కుమార్తె బట్టలు రెడీ చెయ్యడానికి వస్తున్నారని సమాచారం. దీనితో ఒక్కసారిగా ఈ వివాహం హైలెట్ అయింది. ఒక పక్క కేసులు ఇబ్బంది పెడుతున్నా సరే శ్రీరాములు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఈ పెళ్లి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

Read more RELATED
Recommended to you

Latest news