ఓటీటీలో ‘కార్తికేయ-2’ మూవీ.. ఎప్పుడంటే..?

-

వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు సూపర్ కలెక్షన్స్ అందుకున్న కార్తికేయ-2 సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమా కోసం అప్పుడు చూడని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆగస్టు 13వ తేదీన థియేటర్లలో విడుదలైన కార్తికేయ-2 రిలీజ్ డేట్ నుంచి ఇప్పటి వరకు రూ.120 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దమైంది. అక్టోబర్ 5న ప్రముఖ ఓటీటీ వేదికైన జీ5లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. జీ5 నుంచి అధికారికంగా ప్రకటన లేకపోయినా.. సోషల్ మీడియాలో హీరో నిఖిల్ పోస్ట్ చేయడంతో అక్టోబర్ 5 ఓటీటీ విడుదల తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news