చివరికి ఆ పార్టీలో చేరిన కత్తి కార్తీక..?

-

టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవలే అనారోగ్యం బారిన పడి మృతి చెందడంతో దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు అనివార్యంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో ఎంతో మంది పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సినీ నటి యాంకర్ కత్తి కార్తీక కూడా పోటీ చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇటీవలే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లో చేరారు కత్తి కార్తిక. దుబ్బాక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రథసారథి బండా సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ లోకి అడుగుపెట్టారు కత్తి కార్తీక. కత్తి కార్తీక ను హైదరాబాద్ జిల్లా పార్టీ కన్వీనర్ గడ్డమీది హరినాథ్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం కత్తి కార్తీక ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news