సీఎం కేసీఆర్ జగిత్యాల సభకు కవిత హాజరు

-

ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు.

సీఎం కేసీఆర్ నేడు జగిత్యాలలో పర్యటించనుండగా మోతే గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు ఎమ్మెల్సీ కవిత కూడా హాజరు కానున్నారు. ఈనెల 11న ఆమెను సిబిఐ విచారించనుండగా కవిత సీఎం సభలో పాల్గొననుండటం ఆసక్తిగా మారింది. ఇప్పటికే కేంద్రంపై విరుచుకుపడుతున్న కేసీఆర్, సభలో కవితకు సిబిఐ నోటీసులు, విచారణ పై మాట్లాడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news