కేబీసీ విన్నర్ చెప్పింది వింటే మీరు షాక్!!

-

టీవీ ప్రోగ్రామ్స్‌లో కొన్ని ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా వారు దానిలో పాల్గొనాలని తహతహలాడుతుంటారు. అలాంటి కోవలోకి వచ్చే ప్రోగ్రామ్ కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ). సామాన్యులను కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారుస్తోన్న ఈ కార్యక్రమానికి జనాల్లో భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రసారమవుతోన్న 11వ సీజన్‌లో బీహార్‌కు చెందిన సనోజ్ రాజ్ తొలి కోటీశ్వరుడిగా గుర్తింపు తెచ్చున్న విషయం చాలామందికి విదితమే. తాజాగా ఓ మహిళ రూ. కోటి గెలుచుకుని రికార్డు సృష్టించింది.

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండే బబితా టేడ్ అనే మహిళ కేబీసీలో ఇప్పటికే రూ.కోటి గెల్చుకుని.. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నను ఎదుర్కొబోతున్నారు. ఈ క్రమంలో బబితా మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటం ద్వారా నేను నెలకు రూ.1500 మాత్రమే సంపాదించేదాన్ని. పాఠశాలలో పిల్లల కోసం కిచిడి వండేదాన్ని. ఇంత భారీ మొత్తాన్ని సంపాదిస్తానని కలలో కూడా ఊహించలేదు అని తెలిపారు.


షో వ్యాఖ్యాతగా బిగ్ బీ (అమితాబ్ బచ్చన్) వ్యవహరిస్తున్నారు. కోటి రూపాయలు గెలిచిన తర్వాత అమితాబ్ మీరు ఇక్కడ గెలిచిన డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు అని బబితను ప్రశ్నించగా.. ఓ ఫోన్ కొనుక్కుంటాను. ప్రస్తుతం మా ఇంట్లో అందరికి కలిపి ఒక్కటే ఫోన్ ఉంది అని తెలిపారు. దాంతో ఆశ్చర్యపోవడం అమితాబ్ వంతయ్యింది. దీనికి కారణం ఈ కార్యక్రమానికి వచ్చే వారంతా షోలో ఎక్కువ మొత్తం గెలిచి.. ఇంటిని కొనుగోలు చేస్తామని.. అప్పులు తీరుస్తామని చెప్పేవారు. కానీ బబిత మాత్రం ఇందుకు విరుద్ధంగా ఫోన్ కొంటాననడంతో బిగ్ బీ షాక్‌కు గురయ్యారు. ఏది ఏమైనా పాఠశాలలో వంటచేసే స్త్రీ తన మేధస్సుతో కోటీశ్వరురాలుగా మార్చిన కేబీసీకీ అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news