కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

-

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం భువనగిరి సెగ్మెంట్ పరిధిలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ వల్లే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ధరణి పోర్టల్ ,కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news